జర్నలిస్టుల బతుకులు

ప్రపంచానికి వార్తలు అందించే జర్నలిస్టుల బతుకులు ఎంత దారుణంగా మారాయన్నది ఇరాక్ లో పని చేసే జర్నలిస్టుల సంగతి చూస్తే తెలుస్తుంది. 2015 ఒక్క ఏడాదిలో ఇరాక్ లో 29 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో 20 మంది ఐఎస్ తీవ్రవాదులే హతమార్చటం గమనార్హం. ఐఎస్ వ్యతిరేక పోరాటాల్నికవర్ చేస్తున్న ముగ్గురితో సహా.. పలువురు జర్నలిస్టులను కిడ్నాప్ చేసి.. అనంతరం చంపేశారు.  ఇరాక్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకున్న నాటి నుంచి ఇప్పటివరకూ 435 మంది జర్నలిస్టులు ఇరాక్ లో హత్యకు గురయ్యారు. కేవలం పన్నెండేళ్ల వ్యవధిలో ఇంతమంది జర్నలిస్టులు ఒక దేశంలో హత్యకు గురి కావటం గమనార్హం.

0 కామెంట్‌లు :: జర్నలిస్టుల బతుకులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి